మహేష్ ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు!
on Aug 13, 2020
సూపర్ స్టార్ మహేష్ బాబు తమకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారని హీరో అడివి శేష్ చెబుతున్నారు. అతను హీరోగా నటిస్తున్న 'మేజర్'ను సోనీ పిక్చర్స్ సంస్థతో కలిసి మహేష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణ విషయంలో మహేష్ తమకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారనీ, అంత పెద్ద హీరోతో కలిసి పని చేయడం గౌరవంగా ఉందని అడివి శేష్ ఎగ్జయిట్ అవుతున్నాడు.
ముంబైలో 26/11 ఉగ్రదాడిలో దేశభద్రత కోసం ప్రాణాలు అర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా 'మేజర్'ను తెరకెక్కిస్తున్నారు. ఉన్నికృష్ణన్ గురించి మీడియాలో వచ్చిన కథనాతో పాటు, ఆయన తల్లితండ్రులను కలిసిన అడివి శేష్ మరింత సమాచారం సేకరించి సినిమా రూపొందిస్తున్నారు. ఆల్రెడీ 40 పర్సెంట్ సినిమా షూటింగ్ కంప్లీట్ చేశారు. మేజర్ రోల్ కోసం అడివి శేష్ 8 కిలోల బరువు తగ్గారు. 'మేజర్' తరవాత ఈ హీరో 'గూఢచారి 2' చేయనున్నాడు.